Ticker

6/recent/ticker-posts

జిల్లా పరిషత్ CEOగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ – చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి , శుభాకాంక్షలు తెలియజేశారు..





ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ CEOగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ – చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి , శుభాకాంక్షలు తెలియజేశారు..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా (CEO) బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పి. జగదాంబ , జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గారు,  పి. జగదాంబ  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అలాగే, జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ప్రణాళికాబద్ధంగా పనులను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయడంతో పాటు, గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్  కోరారు.
ఈ సందర్భంగా  పి. జగదాంబ  మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అధికారులతో సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.